కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దశాబ్దాల కల అని, దీనిని మోడీ నిజం చేశారని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. 2025 డిసెంబర్ నాటికి సివిల్ పనులు పూర్తి చేసి.. 2026 నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఇది దేశంలోనే అతిపెద్ద రైల్వే యూనిట్ అవుతుందని, దీని ద్వారా మూడు వేల మందికి ఉపాధి లభిస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వరంగల్కు ఎయిర్పోర్టు కూడా వస్తుందని ఆయన హామీ ఇచ్చారు.