మహిళా సాధికారత కోసం ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే మత్స్యకార మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏపీ మత్స్యశాఖ ప్రయోగాత్మకంగా ఓ కార్యక్రమం ప్రారంభించింది. విశాఖ సాగరతీరంలో మత్స్యకార మహిళలతో సముద్రపు నాచు పెంపకం చేపడుతున్నారు. ప్రస్తుతం 30 మంది మహిళలతో పైలెట్ ప్రాజెక్టుగా దీనిని చేపట్టారు. త్వరలోనే మరో రెండు చోట్లకు విస్తరించే ఆలోచనలో ఉన్నారు. దీని ద్వారా మత్స్యకార మహిళలకు ఉపాధి దక్కుతుందని అధికారులు చెప్తున్నారు.