మే నెలలో పెళ్లిళ్ల సందడి ముగిసింది. జూన్ 10 నుండి గురు మూఢమి, ఆ తరువాత ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో దాదాపు 48 రోజుల పాటు శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. జూలై 26 వరకు పెళ్లి బాజాలు మోగవు. దీనితో వివాహాది శుభకార్యాలపై ఆధారపడిన పూజారులు, వాయిద్యకారులు, క్యాటరింగ్ సిబ్బంది వంటి వేలాది మంది ఉపాధి కోల్పోనున్నారు. తిరిగి శ్రావణ మాసంలో జూలై 26 నుండి ముహుర్తాలు ప్రారంభమవుతాయి.