TG Govt Seized 420 Acres in Khammam: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. హైదరాబాద్లో మాత్రమే కాక జిల్లాల్లోనూ భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఖమ్మం జిల్లాలో కబ్జాకు గురైన.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కోసం సేకరించిన 800 ఎకరాల భూమిలో.. 420.08 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చొరవతో ఇది సాధ్యం అయ్యింది. ఐదు దశాబ్దాలుగా కబ్జాకోరల్లో ఉన్న ఈ భూములను ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారు.