కేంద్ర బడ్జెట్ కేవలం మూడు, నాలుగు రాష్ట్రాల బడ్జెట్ మాదిరిగా ఉందని బీఆర్ఎస్ నేతలు హరీష్, కవిత విమర్శించారు. తెలంగాణకు నిధులు రాబట్టుకోవడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజీపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్నా.. వచ్చిన నిధులు గుండు సున్నా అని ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. కేంద్రం మెప్పు కోసం ఆ రెండు పార్టీలు తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాయని ఫైరయ్యారు.