ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ సిబ్బందికి ఊహించని షాకిచ్చింది. ఒకేసారి 800 మందికి పైగా సచివాలయ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరి ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో సిబ్బందికి నోటీసులు ఎందుకు జారీ చేశారంటే.. సదరు సిబ్బంది కౌశలం సర్వే విధులను నిర్లక్ష్యం చేయడంతో కమిషనర్ వారికి నోటీసులు జారీ చేశారు. ఇక నుంచైనా సిబ్బంది కౌశలం సర్వే చేపట్టడంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ మీకోసం..