Penuganchiprolu Farmer Land Lucky Draw: భూములు, స్థలాలు అమ్మడానికి లాటరీలు తీస్తున్న ఈ రోజుల్లో, ఎన్టీఆర్ జిల్లా రైతు రాంబాబు తన 95 సెంట్ల భూమిని అమ్మడానికి వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. రూ.500 టోకెన్లతో లాటరీ వేసి భూమిని పంచాలనుకున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేశారు. అయితే, పోలీసులు రంగంలోకి దిగి టోకెన్ల అమ్మకాలను ఆపేశారు. డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.