సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత పలకరింపులు కరువయ్యాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఫోన్తోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇలా పరిచయం లేని వ్యక్తులతో ప్రేమలో పడి మోసపోతున్న వారు చాలా మందే ఉన్నారు. అంతే కాకుండా.. హత్యలు, ఆత్మహత్యల కేసులు కూడా పెరిగిపోవడానికి కారణం సోషల్ మీడియానే అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటనే ఒకటి మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ చోటుచేసుకుంది. భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో వివాహిత పారిపోయింది.