టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో కొలువుదీరడంతో అమరావతి రాజధాని నిర్మాణానికి ఊపు వచ్చింది. అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి చేతుల మీదుగా పునఃప్రారంభోత్సవం జరిపి, పనులు మొదలుపెట్టారు. మరోవైపు, అమరావతి ముఖద్వారంగా మూలపాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని కూడా యోచిస్తున్నారు.