అనకాపల్లి జిల్లా నక్కపల్లి హెటిరో పరిశ్రమలో గ్యాస్ లీకైంది. మంగళవారం రాత్రి విషవాయువు లీకైంది. ఈ ఘటనలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులను హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే పరిశ్రమల్లో భద్రతపై అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.