Apsrtc Outsourcing Employees Insurance: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత మరణిస్తే వారి కుటుంబీకులకు అంత్యక్రియల ఖర్చుల కోసం అందజేసే డబ్బుల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో రూ.15వేలు ఉండగా.. ఇప్పుడు దానిని రూ.25వేలు చేశారు. అంతేకాదు ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా బీమా సౌకర్యం కల్పించేలా ఉత్తర్వులు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి రూ.10 లక్షల బీమా చేయాలని ఆర్టీసీ ఎండీ తిరుమలరావు ఉత్తర్వుల్లోల పేర్కొన్నారు.