ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్లకు డిమాండ్ పెరుగుతోంది. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా హోటల్స్ మూతపడుతున్న పరిస్థితి. అలాగే మరికొందరు టిఫిన్ రేట్లు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే సామాన్య ప్రజానీకం అన్న క్యాంటీన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మధ్యాహ్న సమయాల్లో అన్న క్యాంటీన్లకు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5లకే భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 205 అన్న క్యాంటీన్ల ద్వారా సేవలు అందిస్తున్నారు.