ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త. ఉగాది కానుకగా అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. పీఎం కిసాన్ యోజన 22వ విడత నిధులను మార్చి 13వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. పీఎం కిసాన్ యోజనతో పాటుగానే అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా విడుదల చేస్తూ ఉండటంతోనే.. ఉగాదికి ముందుగా మార్చి 13న అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత నిధులను ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిసింది. మొత్తం రూ.6000 రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు సమాచారం.