నంద్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయ్యవారి కోడూరుకు చెందిన సుధీశ్వర్ రెడ్డి అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రేపు ఇంటర్ ఫలితాలు వెల్లడి కానున్న వేళ.. గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షల భయంతోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జీవితమంటే చదువు మాత్రమే కాదని చెబుతున్నారు.