Rythu Bharosa: తెలంగాణ రైతులకు ఉగాది కానుక.. రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్..

2 hours ago 1
రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. మార్చి 22వ తేదీ రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. సిద్ధిపేట జిల్లా నర్మెట్ట వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు భరోసా తొలి విడత నిధుల విడుదల జరగనుంది. ఆ తర్వాత ఏప్రిల్ నెల మధ్యలో రెండో విడత, ఏప్రిల్ నెలాఖరులో మూడో విడత రైతు భరోసా నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. మొత్తం 9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు.
Read Entire Article