మెయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు ఎంపీ, పుట్టా మహేష్ కుమార్ యాదవ్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై పుట్టా మహేష్ కుమార్ యాదవ్ వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. అలాగే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టా మహేష్కు స్పష్టం చేసినట్లు తెలిసింది. వ్యక్తులు, నేతలు చేసే తప్పులతో పార్టీకి నష్టం జరగనివ్వనని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం.