ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులైన ధనుంజయరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్లను విచారించిన కోర్టు.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఈ కేసులో ఏ4గా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.