ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం షాపులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పర్మిట్ రూమ్లకు తిరిగి అనుమతి ఇవ్వాలనే ఆలోచనలో ఎక్సైజ్ శాఖ ఉంది. దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చిన తర్వాత పర్మిట్ రూమ్లను రద్దు చేయడంతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. అలాగే పర్మిట్ రూమ్లు రద్దు వలన ప్రస్తుతం రోడ్లపై మద్యం తాగుతున్న వారి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ పునరాలోచనలో ఉన్నట్లు తెలిసింది.