Andhra Pradesh New Medtech Zone IN Nellore District: ఆంధ్రప్రదేశ్లో మరో మెడ్టెక్ జోన్ ఏర్పాటు కానుంది. నెల్లూరు జిల్లా దగదర్తిలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి అవసరమైన భూములను సేకరించేందుకు అధికారులు దృష్టి సారించారు. దగదర్తి, వెలుపోడు గ్రామాల్లోని 140 ఎకరాల భూమిని సేకరించనున్నారు. విశాఖపట్నంలో తొలి మెడ్టెక్ జోన్ విజయవంతం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే భూసేకరణ పూర్తి చేస్తామంటున్నారు.