ఎర్రచందనం స్మగ్లింగ్కు సహకరించారనే కారణంతో ఇద్దరు అటవీ శాఖ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిస్మిస్ చేసింది. అన్నమయ్య జిల్లా పీలేరు రేంజ్ పరిధిలోని ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంది. ఇద్దరిని విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ జనవరి మూడో తేదీన జిల్లా అధికారి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే ఉన్నతాధికారుల గోప్యతతో విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.