AP News: ఏపీలో గ్యాస్ కొరత వార్తలు.. మంత్రి కీలక ప్రకటన

3 months ago 26
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం, గల్ఫ్ దేశాల్లో పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ క్రమంలోనే వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని తెలిపారు. సిలిండర్ల నిల్వలు, సరఫరాపై సమీక్షించిన నాదెండ్ల మనోహర్.. బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అలాంటివి ఏవైనా ఉంటే ప్రజలు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించే వారి మీద చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
Read Entire Article