Andhra Pradesh Police Warn Un Official Stickers: ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ట్రాఫిక్ నిబంధనల విషయంలో సీరియస్గా ఉన్నారు. ఇటీవల కాలంలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించారు. మార్చి 1 నుంచి కొన్ని జిల్లాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు విధించే జరిమానాలను కూడా పెంచారు.. అయితే తాజాగా పోలీసులు వాహనదారుల్ని హెచ్చరించారు. స్టిక్కర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపుతామన్నారు.