AP News: శ్రీకాళహస్తిలో ప్రమాదం.. టైల్స్ పరిశ్రమలో పేలుడు

3 months ago 9
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఓ టైల్స్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఎల్లంపాడు గ్రామం సమీపంలోని ఓ టైల్స్ పరిశ్రమలో ఈ పేలుడు చోటుచేసుకుంది. అయితే గ్యాస్ సిలిండర్ పేలడమే ప్రమాదానికి కారణమని సమాచారం. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని వెంకటగిరి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Read Entire Article