AP Pensions: ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల గురించి.. అసెంబ్లీలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంచలన ప్రకటన చేశారు. వారందరికీ పెన్షన్లు కట్ చేస్తామని తేల్చి చెప్పారు. అనర్హులను గుర్తించి.. వారి పెన్షన్లు తొలగిస్తామని స్పష్టం చేశారు. అనర్హులకు పెన్షన్లు తీసేసినా తప్పులేదని వెల్లడించారు. ఇప్పటివరకు 14 వేల మందికి పెన్షన్లు తొలగించామని.. అనర్హులను గుర్తించే సర్వే పకడ్బందీగా జరుగుతోందని వివరించారు.