ఏపీలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పలు జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అమరావతిలో వడగండ్ల వాన పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వచ్చే మూడు గంటలలో ఏపీలోని పలు జిల్లాలలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ బుధవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. మరోవైపు తుళ్లూరులో పిడుగుపడి ఓ వ్యక్తి చనిపోయారు.