Andhra Pradesh Rains: ఆంధ్రప్రదేశ్లో మరోసారి వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి, పంటలకు నష్టం వాటిల్లింది. అయితే, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని ఐఎండీ తెలిపింది, ఇది రైతులకు కొంత ఊరటనిచ్చే విషయం.