ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని జిల్లాలలో ఎండలు కాస్తుంటే మరికొన్ని చోట్ల వానలు కురుస్తున్నాయి. వచ్చే మూడు రోజులు ఇదే తరహా వాతావరణం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం రోజున విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని అంచనా వేసింది. పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.