ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. మంగళవారం నాటికి అల్పపీడనంగా మారనుంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. సోమవారం రోజు పలుజిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.