ఏపీని తుపాను భయపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడురోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడా అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ కీలక సూచనలు చేసింది. అల్పపీడనం ప్రభావంతో బుధవారం అక్కడక్కడా భారీ నుంచి అతి తీవ్ర భారీ వర్షాలు కురుస్తాయన్న విపత్తుల నిర్వహణ సంస్థ.. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.