వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. పుష్కరాల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం.. కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. పకడ్బందీ చర్యలతో గోదావరి పుష్కరాలను నిర్వహిస్తామని మంత్రులు వెల్లడించారు. ఇక గోదావరి తీరాన ఉన్న పుణ్యక్షేత్రాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. భక్తులకు ఇబ్బంది లేకుండా రోడ్లు, ట్రాఫిక్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.