ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది,.మరోవైపు ఎండాకాలంలో అకాల వర్షాలతో పంటలను నష్టపోతున్నామని ైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.