ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. మే ఏడో తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు విషయమై కీలక అప్ డేట్ వచ్చింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. వైసీపీ హయాంలో వచ్చిన 3.36 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని.. అవి ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు.