ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. మే నెల మొదటి వారం నుంచి రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కొత్త రేషన్ కార్డులు కావాల్సిన వారు, అలాగే మార్పులు, చేర్పులు చేయాల్సిన వారు గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదిస్తున్నారు. అయితే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు సమయంలో కొంతమందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆధార్ సీడింగ్, విద్యుత్ వినియోగం మ్యాపింగ్ విషయంలో తప్పుల కారణంగా ఆధార్ సేవా కేంద్రాలు, విద్యుత్ కార్యాలయాలను సంప్రదిస్తున్నారు.