ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొన్ని జిల్లాలలో వానలు కురుస్తుండగా.. మరికొన్ని జిల్లాలలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. మరో ఐదురోజుల పాటు ఇలాంటి వాతావరణ పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఎండలు పెరుగుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సూచించింది. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.