నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు చనిపోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. చింతపల్లి మండలంలోని చెన్నారం గేట్ వద్ద ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. వీరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.