ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో సెమీ రింగ్ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. విశాఖలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సెమీ రింగ్ రోడ్డు నిర్మించాలని భావిస్తున్నారు. ఈ అంశంపై వీఎంఆర్డీఏ అధ్యయనం జరుపుతోందని మంత్రి నారాయణ తెలిపారు. మరోవైపు విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు రెండు, మూడు నెలల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తాయని నారాయణ తెలిపారు. ఆలోపు టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.