ఆంధ్రప్రదేశ్లో ఆదివారం రోజున ( మార్చి 29) 35 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 87 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శనివారం ఏపీలో అత్యధికంగా 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత మార్కాపురం జిల్లాలో నమోదైనట్లు తెలిపింది. 48 చోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. ప్రజలు డీహైడ్రేషన్కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.