ఆంధ్రప్రదేశ్లో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. విశాఖలో గురువారం కురిసిన భారీ వర్షానికి స్టీల్ ప్లాంట్ వద్ద వేదిక కూలిపోయింది.