AP: ఏప్రిల్ 15 నుంచి కొత్త కార్యక్రమం.. ఇంటింటికీ సచివాలయ సిబ్బంది, రెడీగా ఉండండి..

11 months ago 14
ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసేవలను పారదర్శకంగా, మరింత సులభంగా ప్రజలకు అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మనమిత్ర పేరిట వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఈ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. అందులో భాగంగా ఏప్రిల్ 15 నుంచి ఇంటింటికీ మనమిత్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది. ఈ సందర్భంగా పౌరులకు వాట్సాప్ గవర్నెన్స్ మీద అవగాహన కల్పించి.. వారి ఫోన్లలో నంబర్ సేవ్ చేయనున్నారు.
Read Entire Article