Army Jawan Murali Naik: మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామన్న చంద్రబాబు

10 months ago 29
సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్‌కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. మురళీ నాయక్ స్వస్థలం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా. అనంతపురం పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు మురళీ నాయక్ వీరమరణం వార్త విని స్పందించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు.. వారికి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ చనిపోవటం బాధాకరమన్న చంద్రబాబు .. ఆయన దేశం కోసం చనిపోయారని అన్నారు. ఆయన త్యాగం వృథా కాదన్నారు.
Read Entire Article