వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలో పర్యటించిన వైఎస్ జగన్.. ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించిన జగన్..వారికి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం మురళీ నాయక్ కుటుంబానికి రూ.25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించినందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.