Asaduddin Owaisi Call for Muslims: ఇండియా-పాక్ ఉద్రిక్తతల వేళ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గదని అన్నారు. అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదని.. వారిని చంపుతున్న పాకిస్తాన్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ సైన్యానికి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.