Bandaru Sravani: శింగనమలలో టీడీపీ నేతల బాహాబాహీ.. ఎమ్మెల్యే వర్సెస్ టూమెన్ కమిటీ

11 months ago 17
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో టీడీపీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. మండల కన్వీనర్ల ఎంపికలో వర్గపోరు బయటపడింది. ఎమ్మెల్యే బండారు శ్రావణి, టూమెన్ కమిటీ మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. మండల కన్వీనర్ పదవులను తన వర్గం వాళ్లకు ఇప్పించాలని బండారు శ్రావణి ప్రయత్నించగా.. మరోవైపు నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో తమ వర్గీయులకే పదవులు ఇవ్వాలంటూ ఇటు శ్రావణి వర్గం, అటు మరో వర్గం గొడవకు దిగింది. దీంతో రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
Read Entire Article