పర్యావరణవేత్త, జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ దృఢం సినిమాపై రివ్యూ ఇచ్చారు. ఎక్స్ వేదికగా సినిమా ఎలా ఉందనే దానిపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అయితే ఏపీలో ప్రస్తుతం సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం.. సీఐ నాగరాజుపై కేసు వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితులలో పోలీసులు, శాంతిభద్రతలు వంటి అంశాల చుట్టూ తిరిగే దృఢం సినిమా గురించి బొలిశెట్టి ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.