Bandi Sanjay: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సహా జడ్జిలు, అధికారులు ఇలా చాలా మంది ఫోన్లను ట్యాప్ చేశారని.. కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలకు తెరలేపారు. ఈ కేసు విచారణలో భాగంగా సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన బండి సంజయ్.. బయటికి వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు.