బాపట్ల జిల్లా వేటపాలెం మండలం ఆమోదగిరిపట్నంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వీధిలో రోడ్డు వేస్తుండగా ఇంటి ముందున్న కారును తొలగించకుండానే కాంట్రాక్టర్ సిమెంట్ రోడ్డు వేశాడు. ఏడాదిగా కారు అక్కడే ఉందని, తీయమని చెప్పినా యజమాని పట్టించుకోలేదని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. కాంట్రాక్టర్ సర్వే చేయకుండానే రోడ్డు వేశారని కారు యజమాని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. అయితే దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.