BITS Pilani at Amaravati in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్), పిలానీ రానుంది. రూ.1000 కోట్లతో 35 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. 2027 నాటికి కార్యకలాపాలు ప్రారంభించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులతో 7000 మంది విద్యార్థులను చేర్చుకోనున్నారు. మరోవైపు ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్టీ సంస్థలు కలిసి క్వాంటం వ్యాలీని, హెచ్సీఎల్ టెక్నాలజీస్ సెంటర్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే.