తెలంగాణలో అసంపూర్తిగా ఉన్న 69 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులే స్వయంగా పూర్తి చేసుకునేలా (BLC పద్ధతిలో) చర్యలు చేపట్టినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. అందుకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. గత ప్రభుత్వం కనీస వసతులు లేకుండా అరకొరగా పూర్తిచేసిన ఇళ్లకు తమ ప్రభుత్వం రూ.640 కోట్లు ఖర్చు చేసి వసతులు కల్పించిందన్నారు. ఇప్పటికే 98 వేల మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించామని, మిగిలినవి కూడా త్వరలో అందిస్తామని చెప్పారు.