తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. పేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించే ఈ పథకం కింద ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక జరిగి, నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. వచ్చే మూడున్నరేళ్లలో మరో 20 లక్షల ఇళ్లు కేటాయించే ప్రణాళిక ఉందన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తామని స్పష్టం చేశారు.