గ్రూప్-1 ఫలితాలపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువు నష్టం నోటీసులు పంపింది. వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేకపోతే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. రాకేశ్ రెడ్డి ఆరోపణలను ఖండించిన టీజీపీఎస్సీ నిరాధార ఆరోపణలు చేశారని మండిపడింది.